హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): రాజకీయ స్వప్రయోజనాల కోసం కొందరు అగ్రకులాల నేతలు బీసీ మంత్రులే లక్ష్యంగా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారని, అది ఎంతమాత్రం తగదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ సూచించారు. ఇకనైనా ఆరోపణలు మానుకోకపోతే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు.