హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): వీఆర్ఏల నియామకాలకు సంబంధించిన కేసును హైకోర్టు మూసివేసినట్టు తెలుస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా 20,555 మంది వీఆర్ఏలను క్రమబద్ధీకరిస్తూ జూలై 24న ఉత్తర్వులు విడుదల చేసిన ప్రభుత్వం.. వారిలో 61 ఏండ్లలోపు వయసున్న 16,758 మందిని ఆగస్టు మొదటి వారంలో ఇతర శాఖల్లోకి సర్దుబాటు చేసింది.
మిగతావారి వారసులకు ఉద్యోగాలు ఇస్తామని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన జీవో 81, 85పై హైకోర్టును ఆశ్రయించిన 30 మంది ఆఫీస్ సబార్డినేట్లు.. ట్రెసా చొరవతో తమ పిటిషన్ను వెనక్కి తీసుకుంటామని కోర్టుకు తెలిపారు. దీంతో హైకోర్టు ఆ కేసును మూసివేసినట్టు ట్రెసా నేతలు తెలిపారు.