Telangana | హైదరాబాద్, జూలై 28 (నమస్తే తె లంగాణ): భారీ వర్షాలకు దెబ్బతిన్న పంచాయతీరాజ్, ఆర్అండ్బీ రోడ్లకు అధికారులు తక్షణం తాత్కాలిక మరమ్మత్తులు చేస్తున్నారు. వరదలు తగ్గాక పూర్తిస్థాయి మరమ్మత్త్తులు చేయనున్నా రు. పీఆర్, ఆర్అండ్బీ అధికారులు రా ష్ట్ర కార్యాలయం నుంచి నిత్యం పర్యవేక్షిస్తూ క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు, సూచనలు జారీ చేస్తున్నారు. 768 కిలోమీటర్ల మేర పంచాయతీరాజ్ రోడ్లు దెబ్బతిన్నాయని అంచనా వేశారు.
వీటి తాత్కాలిక మరమ్మత్తులకు రూ.30 కోట్లు అవసరమని అంచనాలు రూపొందించారు. కల్వర్టులు, క్రాస్ డ్రైనేజీ (సీడీ ) వర్కులకు 391 చోట్ల నష్టం వాటిల్లిందని గుర్తించారు. రూ.8.67కోట్లు తాత్కాలిక మరమ్మత్తులకు నివేదించారు. 117 చోట్ల రోడ్లకు గండ్లు పడ్డాయని గుర్తించారు. వీటి మరమ్మత్తులకు రూ.42 కోట్లు అవసరమని తేల్చారు. పట్టణాలు, నగర పాలక సంస్థల్లో నిత్యం పరిస్థితిని మున్సిపల్ శాఖ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నది. మాసాబ్ ట్యాంక్లోని సీడీఎంఏ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. 1651 మందితో 278 అత్యవసర బృం దాలను ఏర్పాటు చేశారు. 23 వేల ఇం డ్లపై వరద ప్రభావం పడిందని అంచనా వేశారు. 6 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. 53 చోట్ల రోడ్లకు గండ్లు పడ్డాయి. వీటిలో 29 రోడ్లకు మరమత్తులు పూర్తి చేశారు. పట్ట ణ స్థానిక సంస్థల్లో 83 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయని గుర్తించారు. 51 కల్వర్టులు, 18 కిలోమీటర్ల డ్రైనేజీలు దెబ్బతిన్నాయని గుర్తించారు.