నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రశ్నించిన ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికలు ప్రచురించిన వార్తల్లో తప్పులేదని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
ఉన్నదున్నట్లు రాసిన పత్రికలపై బీజేపీ ఎంపీలు తప్పుడు ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికలకు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వడం విడ్డూరమని వ్యాఖ్యానించారు.
నిజామాబాద్ కలెక్టరేట్లో జిల్లాస్థాయి ఖో ఖో, కబడ్డీ క్రీడలను మంత్రి ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ‘మన ఊరు మన బడి’ పై సమీక్ష నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డ్రామా ఆర్టిస్ట్ అని మంత్రి వేముల ఆరోపించారు. గడిచిన బిజెపి పాలనలో దేశం వెనుకబాటుకు గురైందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశానికి సరికొత్త ెజెండా రాబోతుందని తెలిపారు.