కన్నూర్, ఫిబ్రవరి 9: ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించడాన్ని ఆయన కూతురు సౌమ్య స్వామినాథన్ స్వాగతించారు. తన తండ్రి సేవలను గుర్తించి దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించడం తమ కుటుంబానికి సంతోషంగా, గర్వకారణంగా ఉందని తెలిపారు. తమ తండ్రికి ఈ అవార్డు ఇవ్వడం శాస్త్ర సాంకేతికతలను ఉపయోగించి సమాజానికి సేవ చేయొచ్చనే సందేశాన్ని యువతకు అందిస్తుందని ఆమె అన్నారు. బతికుండగా ఈ అవార్డు ప్రకటించి ఉంటే ఎంఎస్ స్వామినాథన్ ఎలా స్పందించి ఉండేవారన్న ప్రశ్నకు ఆమె బదులిస్తూ ‘ఈ వార్త విని ఉంటే ఆయన సంతోషించి ఉండేవారు కానీ ఆయన ఎప్పుడూ అవార్డుల కోసం పని చేయలేదు. గుర్తింపు కోసం వేచి చూడలేదు. ఆయనకు ఎన్నో అవార్డులు, గుర్తింపులు