హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో అమెరికా కాన్సులేట్ నూతన భవనాన్ని ప్రారంభించి ఏడాది పూర్తయ్యింది. దీనిపై అమెరికా కాన్సులేట్ హర్షం వ్యక్తం చేసింది. ‘భారత్-అమెరికా మధ్య బంధాన్ని పటిష్టం చేసిన ఈ భవనం ప్రారంభమై ఏడాది పూర్తయింది’ అని ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేసింది.