హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ) : కాలానుగుణంగా నేర పరిశోధనలో అత్యాధునిక కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను సమర్థంగా వినియోగించుకోవాలని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు రాష్ట్ర పోలీసులకు సూచించారు. ఆదివారం తెలంగాణ పోలీస్ అకాడమీలో తెలంగాణ పోలీస్ రిట్రీట్-2026ను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. తాను తొలిసారి శాసనసభ్యుడిగా ఎన్నికైన సమయంలో రాష్ట్రం లో తీవ్రవాదం విస్తృతంగా ఉండేదని, పోలీసు అధికారు ల అలుపెరుగని కృషి, త్యాగాలతో నేడు తీవ్రవాదం అంతమైందని పేర్కొన్నారు.
భవిష్యత్తు సవాళ్లను ఎదురొనేలా పోలీసింగ్ వ్యవస్థను సిద్ధం చేయడమే ఈ రిట్రీట్ ప్రధాన ఉద్దేశమని స్పష్టంచేశారు. డీజీపీ శివధర్రెడ్డి మాట్లాడుతూ.. రిట్రీట్లో జరిగే చర్చలు వాస్తవికతకు దగ్గరగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ డీజీపీ మహేందర్రెడ్డి, మాజీ డీజీపీ హెచ్జే దొర, అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్ పాల్గొన్నారు.