హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు డాక్టర్ పీ మధుసూదన్రెడ్డిపై ఇంటర్బోర్డు పలు కఠిన చర్యలు తీసుకొన్నది. ఇంటర్బోర్డులో సీసీ కెమెరాలు, భద్రతా వ్యవస్థను ట్యాంపరింగ్ చేసినట్టు మధుసూదన్రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను ఇంటర్ సం స్థల కార్యాలయాల్లోకి ప్రవేశించకుండా, ఉద్యోగులు, సిబ్బందితో మాట్లాడకుండా ఆంక్షలు విధిస్తూ మంగళవారం బోర్డు కమిషనర్ నవీన్మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేష న్, కమిషనరేట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, నాంపల్లి కాలేజీ కాంప్లెక్స్ల్లోకి మధుసూదన్రెడ్డి ప్రవేశిస్తే నేరంగానే పరిగణిస్తామని పేర్కొన్నారు. ఉద్యోగులు అతనితో ఎలాంటి సంబంధాలు పెట్టుకొన్నా క్రిమినల్ చర్యగానే భావిస్తామని హెచ్చరించారు. ఇంటర్ బోర్డ్ ఉద్యోగిని బెదిరించి సీసీ కెమెరాలను ట్యాంప ర్ చేసినట్టు ఆయనపై ఈ నెల 30న బేగంబజార్ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది.