హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని నిర్మించుకొన్న పేదల ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణకు దరఖాస్తుల గడువును మరో నెల రోజులు పొడిగిస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రెవెన్యూ శాఖ మంగళవారం జీవో జారీ చేసింది. దరఖాస్తులను ఈ నెల 31వ తేదీ వరకు పొడిగిస్తూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు.