వరంగల్, సెప్టెంబర్ 12: చారిత్రక భద్రకాళి ఆలయానికి అంతర్జాతీయ ప్రమాణ సంస్థ (ఐఎస్వో) గత ఏడాది ఇచ్చిన గుర్తింపును ఈ ఏడాది కూడా పునరుద్ధరించింది. భక్తులకు అందుతున్న సేవలకుగాను ఈ గుర్తింపు లభించింది. హెచ్వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ శివయ్య ఆదివారం ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, ఆలయ ఈవో రామల సునీత, ప్రధాన అర్చకులు భద్రకాళి శేషుకు ఐఎస్వో గుర్తింపు పత్రాన్ని అందజేశారు.