హైదరాబాద్: షాద్నగర్లో దళిత మహిళపై పోలీసుల దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఖండించారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రే స్వయంగా ఆడబిడ్డలను అవమానిస్తుంటే.. పోలీసులు మాత్రం మేమేమీ తక్కువ అన్నట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆడబిడ్డలపై లాఠీఛార్జీలు, దాడులకు తెగబడుతున్నారన్నారు. దొంగతనం ఒప్పుకోవాలంటూ థర్డ్ ప్రయోగిస్తారా అంటూ నిలదీశారు. మహిళ అని కూడా చూడకుండా ఇంత అమానవీయంగా ప్రవర్తిస్తారా అని ప్రశ్నించారు. ఇదేనా ఇందిరమ్మ పాలన.. ఇదేనా ప్రజా పాలన అంటూ ఎక్స్ వేధికగా ఫైర్ అయ్యారు.
రక్షించాల్సిన పోలీసులతో రక్షణ లేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతున్నదని ప్రశ్నించారు. మహిళలంటే ఇంత చిన్నచూపా.. ఓవైపు అత్యాచారాలు, అవమానాలు.. మరోవైపు దాడులు, దాష్టీకాలంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆడబిడ్డల ఉసురు ఈ ప్రభుత్వానికి మంచిది కాదన్నారు. వాళ్లను గౌరవించకపోయినా ఫర్వాలేదు. ఇలా దౌర్జన్యాలు మాత్రం చేయకండి.
షాద్నగర్లో దళిత మహిళపై పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత నీచమైనదని, బీఆర్ఎస్ పార్టీ ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తోంది. వెంటనే ఈ దాడికి పాల్పడిన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బాధిత మహిళలకు న్యాయం చేయాలని వెల్లడించారు. దళిత వ్యతిరేక.. మహిళా వ్యతిరేక కాంగ్రెస్ సర్కారును తెలంగాణ సమాజం ఎప్పటికీ క్షమించదన్నారు.
‘దళిత మహిళపై ఇంత దాష్టీకమా? ఇదేనా ఇందిరమ్మ పాలన? ఇదేనా ప్రజాపాలన?, దొంగతనం ఒప్పుకోవాలంటూ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా?. మహిళా అని కూడా చూడకుండా ఇంత అమానవీయంగా ప్రవర్తిస్తారా?. నిక్కర్ తొడిగి, బూటు కాళ్లతో తన్నటమా..!. ఇంత కర్కశత్వమా.. సిగ్గు సిగ్గు..!. కొడుకు ముందే చిత్ర హింసలా? రక్షించాల్సిన పోలీసులతోనే రక్షణ లేని పరిస్థితా?.
ఏం జరుగుతోంది ఈ రాష్ట్రంలో.. మహిళలంటే ఇంత చిన్నచూపా..! ఓ వైపు మహిళలపై అత్యాచారాలు, అవమానాలు.. మరోవైపు దాడులు, దాష్టీకాలు. యథా రాజా తథా ప్రజా అన్నట్లు ముఖ్యమంత్రే స్వయంగా ఆడబిడ్డలను అవమానిస్తుంటే.. పోలీసులు మాత్రం మేమేమీ తక్కువ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఆడబిడ్డలపై లాఠీఛార్జీలు, దాడులకు తెగబడుతున్నారు. ఆడబిడ్డల ఉసురు ఈ ప్రభుత్వానికి మంచిది కాదు. వాళ్లను గౌరవించకపోయినా ఫర్వాలేదు. ఇలా దౌర్జన్యాలు మాత్రం చేయకండి.
షాద్నగర్లో దళిత మహిళపై పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత నీచం. బీఆర్ఎస్ పార్టీ ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తోంది. వెంటనే ఈ దాడికి పాల్పడిన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. బాధిత మహిళలకు న్యాయం చేయాలి. దళిత వ్యతిరేక.. మహిళా వ్యతిరేక కాంగ్రెస్ సర్కారును తెలంగాణ సమాజం ఎప్పటికీ క్షమించదు.’
దళిత మహిళపై ఇంత దాష్టీకమా?
ఇదేనా ఇందిరమ్మ పాలన? ఇదేనా ప్రజాపాలన?
దొంగతనం ఒప్పుకోవాలంటూ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా?
మహిళా అని కూడా చూడకుండా ఇంత అమానవీయంగా ప్రవర్తిస్తారా?
నిక్కర్ తొడిగి, బూటు కాళ్లతో తన్నటమా..!
ఇంత కర్కశత్వమా… సిగ్గు సిగ్గు..!
కొడుకు ముందే చిత్ర… pic.twitter.com/d9ERDZnHJo
— KTR (@KTRBRS) August 5, 2024