హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణపై ప్రధాని మోదీ మరోసారి విషం కకారని రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్ర ఏర్పాటు నుంచి తెలంగాణకు మోదీ అడుగడుగునా అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. కొత్త రాష్ట్రం కాబట్టి అవసరాలకు అనుగుణంగా కొత్త సచివాలయం నిర్మించుకొంటున్నామని, మూఢనమ్మకంతోనే కొత్త సచివాలయం నిర్మిస్తున్నామని అనటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు.
కొత్త పార్లమెంట్ భవనం కూడా మూఢ నమ్మకంతోనే కడుతున్నారా? అని ప్రశ్నించారు. మోదీ అధికారం చేపట్టగానే తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలిపి ఇబ్బంది పెట్టారని, రాష్ర్టానికి ఒక జాతీయ సంస్థను కూడా ఇవ్వకుండా అన్యాయం చేశారని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తూ పేదలపై లక్షల కోట్ల అప్పుల భారం మోపుతున్నారని నిప్పులు చెరిగారు. వృద్ధిలో, తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్గా ఎదిగి బీజేపీ పాలిత రాష్ట్రాలను సాకుతున్నదని గుర్తుచేశారు.