ఖమ్మం రూర ల్, డిసెంబర్ 1 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈడీ, ఐటీలను తమ పార్టీ అనుబంధ సంఘాలుగా మా ర్చిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆ రోపించారు. గురువారం ఖ మ్మం రూరల్ మండలంలోని రామ్లీల ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన సీపీఐ కార్యకర్తల సమావేశంలో మాట్లాడా రు. కేంద్రంలోని బీజేపీ ప్ర భుత్వం ఈడీ, ఐటీ సంస్థలను ఇష్టారాజ్యంగా వాడుకుంటున్నదని విమర్శించారు. రాబో యే ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వరంగ సం స్థలను ప్రైవేట్పరం చేసిన ఘన త మోదీకే దక్కిందన్నారు.