హైదరాబాద్, మార్చి27 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణకు ప్రభుత్వం నియమించిన రిటైర్జ్ జడ్జి పీసీ ఘోష్ను కలిసేందుకు ఇరిగేషన్శాఖ కార్యదర్శి రాహుల్బొజ్జా పశ్చిమ బెంగాల్కు వెళ్లనున్నారని విశ్వసనీయ సమాచారం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల ప్లానింగ్, డిజైన్, నిర్మాణ లోపాలు, కాంట్రాక్టుల అప్పగింత తదితర అంశాలపై విచారించి నివేదికను అందజేయాలని జస్టిస్ పీసీ ఘోష్కు మార్గదర్శకాలు జారీచేశారు. ఆయా అంశాలపై చర్చించేందుకు, అందుకు సంబంధించిన సమాచారాన్ని అందజేసేందుకు రాహుల్ బొజ్జా కలకత్తా వెళ్లనున్నారని తెలిసింది.