మేళ్లచెర్వు, జూలై 25 : సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వులోని ఓ సిమెంట్ పరిశ్రమలో మంగళవారం ప్రమాదం సంభవించింది. ఐరన్ సెంట్రింగ్ కూలిన ఘటనలో ఓ కార్మికుడు మృతి చెందగా, మరో ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. మై హోం పరిశ్రమలోని యూనిట్-4 నిర్మాణ పనుల్లో మధ్యప్రదేశ్, బీహార్ రాష్ర్టాలకు చెందిన పలువురు కార్మికులు పని చేస్తున్నారు.
ఈ క్రమంలో మంగళవారం ఆరో అంతస్థులో కాంక్రీట్ పనులు చేసే నిమిత్తం పంపింగ్ చేసే పైపులో జామ్ను వైబ్రేషన్తో తొలగిస్తుండగా నాలుగో అంతస్థు వద్ద 30 మీటర్ల ఎత్తు నుంచి ఐరన్ సెంట్రింగ్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో మధ్యప్రదేశ్కు చెందిన అరవింద్సింగ్(34) మృతిచెందాడు. రాజాసింగ్, అసం జమాల్కు తీవ్ర గాయాలయ్యాయి. హుజూర్నగర్ ఆర్డీవో జగదీశ్వర్రెడ్డి, తహసీల్దార్ దామోదర్రావు ఘటనా స్థలాన్ని సందర్శించి, వివరాలు అడిగి తెలుసుకొన్నారు.