న్యూఢిల్లీ, జూన్ 23: ఇండియన్ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) సీఎండీ సంజయ్ కుమార్ జైన్ తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో తప్పుకుంటున్నానని, ఐఆర్సీటీసీలో పనిచేయటం తన జీవితంలో దక్కిన గొప్ప గౌరవంగా తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
జైన్ రాజీనామాకు ఆమోదం తెలిపిన రైల్వే శాఖ, ఇది వెంటనే అమల్లోకి వచ్చినట్టు ప్రకటించింది. ఈ విషయాన్ని ఐఆర్సీటీసీ మంగళవారం స్టాక్ మార్కెట్ ఫైలింగ్లో తెలియజేసింది. సంజయ్ కుమార్ జైన్ హయాంలో ఐఆర్సీటీసీ మినీ రత్న నుంచి నవ రత్న హోదాకు ఎదిగింది. నిరంతర వృద్ధిని నమోదుచేస్తూ షెడ్యూల్ బీ నుంచి షెడ్యూల్ ఏ కంపెనీగా మారింది.