IPS Transfers | రాష్ట్రంలోని పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ డీజీపీ అంజినీ కుమార్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీగా పని చేస్తున్న పీ కరుణాకర్ను జయశంకర్ భూపాలపల్లి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ)గా బదిలీ చేశారు. జయశంకర్ భూపాలపల్లి ఎస్పీగా పని చేస్తున్న జే సురేందర్ రెడ్డిని, ప్రస్తుతం ఖాళీగా ఉన్న హైదరాబాద్లోని రాష్ట్ర స్థాయి కమాండ్ కంట్రోల్ సెంటర్ అడ్మినిస్ట్రేటివ్ ఎస్పీగా ట్రాన్స్ఫర్ చేశారు.
ప్రస్తుతం వెయింటింగ్లో ఉన్న ఎస్పీ (ఎన్సీ) కే పుష్పను హైదరాబాద్ లోని రాష్ట్రస్థాయి కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ఖాళీగా ఉన్న టెక్నికల్ విభాగం ఎస్పీగా నియమించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మేడ్చల్ డీసీపీగా విధులు నిర్వర్తిస్తున్న గోనె సందీప్ను సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మాదాపూర్ డీసీపీగా బదిలీ చేశారు. మాదాపూర్ డీసీపీగా పని చేస్తున్న కే శిల్పవల్లిని హైదరాబాద్ సిటీ అడ్మినిస్ట్రేషన్ డీసీపీగా నియమించారు.
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ట్రాఫిక్-2 డీసీపీగా పని చేస్తున్న ధన్నారపు శ్రీనివాస్ను హైదరాబాద్ సిటీలో ఖాళీగా ఉన్న ట్రాఫిక్-3 డీసీపీగా బదిలీ చేశారు. వెయింటింగ్లో ఉన్న ఎస్పీ (ఎన్సీ) కే ప్రసన్నరాణిని.. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఏసీబీ జాయింట్ డైరెక్టర్గా నియమించారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ ట్రాఫిక్ అదనపు డీసీపీగా పని చేస్తున్న ఎస్వీఎన్ శివరామ్ను ఏసీబీలోని అదనపు ఎస్పీగా ట్రాన్స్ ఫర్ చేశారు.