జూబ్లీహిల్స్, డిసెంబర్ 29: నకిలీ పత్రాల తో మాజీ ఐఏఎస్ అధికారి భన్వర్లాల్ ఇంటి ని ఆక్రమించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారి నవీన్ ఎట్టకేలకు ఆ ఇంటిని ఖాళీ చేశారు.
జూబ్లీహిల్స్ ప్రశాసన్నగర్లో తన ఇంటిని ఆక్రమించేందుకు నకిలీ పత్రాలు సృష్టించారని ఐపీఎస్ అధికారిపై మాజీ ఐఏఎస్ ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన సీసీఎస్ పోలీసులు నవీన్ను విచారించిన నేపథ్యంలో సదరు ఇంటిని ఖాళీ చేశారు.