హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): త్వరలో జరగనున్న అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) వేడుకలకు గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్కు ఆహ్వానం అందింది. శనివారం రాజ్భవన్లో గవర్నర్ను కలిసిన ఆటా ప్రతినిధులు వేడులకు హాజరుకావాలని కోరారు. ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, సీఐఐ తెలంగాణ అధ్యక్షుడు సీ శేఖర్రెడ్డి, ఆటా బిజినెన్ విభాగం చైర్మన్ లాక్స్ చేపూరి ఆహ్వానపత్రికను ఆమెకు అందజేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ బిజినెస్ సెమినార్కు గవర్నర్ హాజరయ్యేందుకు అంగీకరించినట్టు ప్రతినిధులు తెలిపారు.