మిర్యాలగూడ, ఏప్రిల్ 10: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని మహేశ్ స్పెషాలిటీ దవాఖానలో నకిలీ సీఎంఆర్ఎఫ్ బిల్లులు సృష్టించిన విషయంపై సోమవారం జిల్లా మాస్ మీడియా అధికారి రవిశంకర్ విచారణ చేపట్టారు. మహేశ్ దవాఖాన నుంచి సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని జాన్పహాడ్కు చెందిన డీ జ్యోతి, డీ లక్ష్మి, దామరచర్ల మండలం మంగల్దుబ్బతండాకు చెందిన నాగా పేరుతో రూ.4.52 లక్షల నకిలీ బిల్లులు అందించినట్టు తేలిందని రవిశంకర్ చెప్పారు. దవాఖానలో ఉన్న ఇన్పేషెంట్, అవుట్ పేషెంట్ రికార్డులను, డాక్టర్ల వివరాలు, వారి సర్టిఫికెట్లను పరిశీలించినట్టు తెలిపారు. విచారణ నివేదికను వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులకు అందజేయనున్నట్టు వెల్లడించారు.