హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): తిరుమల ఘాట్ రోడ్డులో బుధవారం ప్రమాదానికి గురైన ఎలక్ట్రిక్ బస్సులో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని ఒలెక్ట్రా సంస్థ ప్రతినిధులు, ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. బుధవారం జరిగిన బస్సు ప్రమాద ప్రాం తాన్ని గురువారం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
ఘాట్రోడ్డులో కాంక్రీట్తో రీటైనింగ్ వాల్ నిర్మించాలని చెప్పారు. అతివేగం లేదా డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇలాంటి ప్రమాదాలు మరోసారి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని, అవసరమైతే ఎలక్ట్రిక్ బస్సుల డ్రైవర్లకు మరోసారి శిక్షణ ఇప్పిస్తామని పేర్కొన్నారు.