హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): నాలుగు నెలల కాలంలో రూ.7.20 కోట్ల విలువైన మత్తు పదార్థాలను సీజ్ చేశామని ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 553 మందిపై కేసులు నమోదయ్యాయని చెప్పారు. 2,283.764 కేజీల డ్రై గంజాయి, 68.865 కేజీల గంజాయి చాక్లెట్లను పట్టుకొన్నామని వివరించారు.