మహబూబ్నగర్: జిల్లాలోని గూడూరులో అంతర్రాష్ట్ర గంజాయి ముఠా పట్టుబడింది. గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 101 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. నిందితులను ఎస్పీ కోటిరెడ్డి మీడియా ముందు హజరుపరిచారు.