హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): వ్యవసాయేతర భూముల రిజస్ట్రేషన్ ప్రక్రియకు సోమవారం అంతరాయం ఏర్పడింది. భూ యజమానుల ఆధార్ డాటాకు అనుసంధానమై ఉండే బయోమెట్రిక్ సమాచార వ్యవస్థలో లోపం తలెత్తినట్టు అధికారులు తెలిపారు.
సాయంత్రం వరకు ఈ సమస్య కొనసాగడంతో రాష్ట్రవ్యాప్తంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో రిజిస్ట్రేషన్ల సేవలు నిలిచిపోయాయి.