హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ) : డిగ్రీ కోర్సుల్లోని విద్యార్థులకు ఇక నుంచి ఇంటర్న్షిప్ తప్పనిసరి. మూడు, నాలుగేండ్ల డిగ్రీ విద్యార్థులు నాలుగో సెమిస్టర్ తర్వాత 60 నుంచి 120 గంటల పాటు పరిశ్రమల్లో ఇంటర్న్షిప్గా పనిచేయాల్సి ఉంటుంది. ఇక నాలుగేండ్ల డిగ్రీ (రిసెర్చ్) విద్యార్థులైతే ఒక సెమిస్టర్ మొత్తం ఇంటర్న్షిప్ చేయాలి. ఇందుకు క్రెడిట్స్ జారీ చేస్తారు.
డిగ్రీలో ఇంటర్న్షిప్పై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) మంగళవారం కీలక నిర్ణయం తీసుకొన్నది. ఇందుకు సంబంధించిన డ్రాఫ్ట్ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆయా మార్గదర్శకాలపై సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరింది. ఇండియా స్కిల్స్ రిపోర్టు ప్రకారం.. 2022లో 88.6శాతం విద్యార్థులు ఇంటర్న్షిప్ల కోసం వెతుకుతున్నట్టు తేలింది. ఈ నేపథ్యంలో యూజీసీ.. డిగ్రీలో ఇంటర్న్షిప్ను తప్పనిసరి చేసింది.