హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 6(నమస్తే తెలంగాణ) : మలేరియా వ్యాధి నిర్మూలనపై అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. తాజాగా మలేరియా జ్వరానికి కారణమైన ప్లాస్మోడియం ప్లాసిఫెరా పారాసైట్ జీవనశైలిని సీసీఎంబీ పరిశోధకులు అధ్యయనం చేశారు. కణాల అభివృద్ధిలో జరిగే పరిణామ క్రమాన్ని పరిశీలించి, నియంత్రణకు నూతన విధానాన్ని అభివృద్ధి చేశారు.
పరాన్నజీవి కణజాల వ్యాప్తిని కట్టడి చేయడం వలన వ్యాధి నిర్మూలన సాధ్యమని తేల్చారు. ఈ అధ్యయనం ద్వారా ఈ రెండు అంశాలను పరిగణనలోకి తీసుకుని కణజాల వ్యాప్తిని లక్ష్యంగా చేసే కొత్త డ్రగ్ తయారీకి సాయపడుతుందని పరిశోధకులు చెప్తున్నారు.