హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రధాన పరీక్షలు బుధవారం సజావుగా ముగిశాయి. దీంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. పరీక్షలకు ముందు విద్యార్థులు కొంత టెన్షన్కు గురయ్యారు. కొంతమంది విద్యార్థులు హెల్ప్లైన్లను ఆశ్రయించి, వారి సూచనల మేరకు పరీక్షలు రాశారు. ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు బుధవారం కామర్స్, కెమిస్ట్రీ పేపర్లకు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు మొత్తం 4,17,525 మంది విద్యార్థులకు 4,02,630 మంది విద్యార్థులు హాజరయ్యారని అధికారులు తెలిపారు. బుధవారం చివరిరోజు మంచిర్యాలలో ఇద్దరు, వికారాబాద్, మేడ్చల్ – మల్కాజిగిరిల్లో ఒకరు చొప్పున విద్యార్థులు డిబార్ అయ్యారు. ఇంటర్ జవాబుపత్రాల మూల్యాంకనం ప్రక్రియను త్వరగా పూర్తిచేసి, మే మొదటి వారంలో ఫలితాలు ప్రకటించాలని అధికారులు భావిస్తున్నారు.