హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): ఇంటర్ బోర్డు అనుబంధ గుర్తింపును ఏడాది కాలానికి కాకుండా ఒకేసారి మూడునాలుగేండ్లకు పొడిగించాలని తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యం సంఘం (టీపీజేఎంఏ) విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బుధవారం విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించింది. మిక్స్డ్ ఆక్యుపెన్సీ నిబంధనను తొలగించాలని, 25 శాతం పెంచిన అనుబంధ గుర్తింపు, ఇన్స్పెక్షన్ ఫీజులను తగ్గించాలని సంఘం నేతలు గౌరీ సతీశ్, మల్లేశం, శ్రీనివాస్చౌదరి, సుధీర్రెడ్డి, గౌసుద్దీన్ కోరారు.