హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 12 నుంచి 20 వరకు నిర్వహించనున్నట్టు ఇంటర్ బోర్డు తెలిపింది. ఉదయం ఫస్టియర్, మధ్యాహ్న సెకండియర్ పరీక్షలు ఉంటాయని వివరించింది.
హాల్టికెట్లను https://tsbie.cgg.gov.in నుంచి పొందాలని సూచించింది. కాగా, ఈ నెల 14 నుంచి 22 వరకు జరిగే పదోతరగతి పరీక్షల హాల్టికెట్లను https:// bse.telangana.gov.in వెబ్సైట్ నుంచి పొందాలని ఎస్సెస్సీ బోర్డు సూచించింది.