హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్ల గడువును ఇంటర్బోర్డు మరోసారి పొడిగించింది. ఈ నెల 15 వరకు అవకాశం కల్పించింది. ఇప్పటి వరకు అడ్మిషన్లు పొందనివారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇంటర్బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ తెలిపారు.