హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ)/వెంగళరావునగర్: అవిభక్త కవలలు వీణావాణి ఇంటర్లో అద్భుత ప్రతిభ కనబర్చారు. వెంగళరావునగర్ డివిజన్ స్టేట్హోం ఆవరణలోని బాలసదనంలో ఉంటూ క్లాసులు వింటూ పరీక్షలు రాసి 70 శాతానికిపైగా మార్కులతో ఇంటర్ పాసయ్యారు. మహబూబాబాద్కు చెందిన వీణావాణీల ఆలనా పాలనా అంతా రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటున్నది. స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హోం (స్టేట్ హోం)లో వీణావాణీలు ఉంటున్నారు. మంగళవారం విడుదల చేసిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో సీఈసీలో వీణాకు 712 మార్కులు, వాణికి 707 మార్కులు వచ్చాయి. ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఇంటర్ బోర్డు వీణావాణీలకు స్టేట్ హోం నుంచే పరీక్ష రాసే అవకాశం కల్పించిందని హోం ఇంచార్జి సఫియా తెలిపారు. ఇంటర్లో అద్భుత ప్రతిభ కనబరిచిన వీణావాణీలను రాష్ట్ర స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అభినందించారు.