ఘట్కేసర్ రూరల్, ఫిబ్రవరి 8: మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలంలోని అవుషాపూర్ ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు, చెట్ల పెంపకానికి అదే గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని జాస్యరెడ్డి సేంద్రియ ఎరువులను సమకూర్చారు. తాను దాచుకొన్న రూ.10 వేలను వెచ్చించి సేంద్రియ ఎరువులను కొనుగోలు చేసి ఎంపీపీ సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా మంగళవారం పాఠశాలకు అందజేశారు. విద్యార్థుల చేత సేంద్రియ వ్యవసాయం చేయించాలని, అందుకు అవసరమయ్యే ఎరువులను ఎప్పటికప్పుడు అందిస్తానని జాస్యరెడ్డి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆ విద్యార్థినిని పలువురు అభినందించారు.