సూర్యాపేట రూరల్, ఫిబ్రవరి 10: అనుమానాస్పద స్థితిలో ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటన సూర్యాపేట మండలం ఇమాంపేట గురుకుల పాఠశాలలో శనివారం రాత్రి చోటుచేసుకున్నది. మృతురాలి బంధువుల కథనం ప్రకారం.. సూర్యాపేటకు చెంది న వెంకన్న కుమార్తె ఇమాంపేట గురుకులంలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నది.
తన కూతురు శనివారం సాయంత్రం వీడియో కాల్ చేసి మాట్లాడినట్టు మృతురాలి తల్లి భాగ్యమ్మ తెలిపింది. రాత్రి 10 గంటల సమయంలో హాస్టల్ నుంచి ఎవరో ఫోన్ చేసి ‘మీ పాప ఆరోగ్య పరిస్థితి బాగోలేదు. సూ ర్యాపేట ప్రభుత్వ దవాఖానకు రావాలి’ అని చెప్పినట్టు ఆమె పేర్కొన్నారు. దవాఖానకు చేరుకునే సరికి తమ కుమార్తె మృతి చెందినట్టు విలపించారు.