హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది ఇంటర్ ప్రాక్టికల్స్కు 3.55 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరికోసం 2,201 పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ ప్రాక్టికల్స్ ఈ నెల 15 నుంచి ప్రారంభమై, మార్చి 2 వరకు కొనసాగుతాయి. పరీక్షల నిర్వహణకు అధికారులు అన్నిరకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యార్థులు తమ హాల్టికెట్లను tsbie.cgg.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఆయా హాల్టికెట్లపై ప్రిన్సిపాల్ సంతకం అవసరం లేదని తెలిపారు. సందేహాలకు 040 24600110ను సంప్రదించవచ్చని విద్యార్థులకు అధికారులు సూచించారు.
అన్ని ఏర్పాట్లు చేశాం
పరీక్షలు సజావుగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశాం. జంబ్లింగ్ విధానం లేదు కనుక ఎవరి కాలేజీల్లో వారే రాసుకోవచ్చు. పరీక్షాకేంద్రాల్లో డిపార్ట్మెంటల్ అధికారులుంటారు. ఆన్లైన్లో ఓటీపీ ఆధారంగా ప్రశ్నపత్రాన్ని డౌన్లోడ్ చేసి అందజేసేలా ఏర్పాట్లు చేశాం. పరీక్షలు ముగిసిన 30 నిమిషాల్లోనే మార్కులను ఆన్లైన్లో నమోదు చేస్తాం. ఎవరైనా విద్యార్థులను భయపెట్టినా ఇబ్బందిపెట్టినా, కంట్రోల్రూంను సంప్రదించవచ్చు. – జయప్రదబాయి, పరీక్షల విభాగం కంట్రోలర్