హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది 100 శాతం సిలబస్తో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. వంద శాతం సిలబస్కు సంబంధించిన నమూనా ప్రశ్నాపత్రాలు ఇంటర్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. కొవిడ్ వల్ల గత రెండేండ్ల నుంచి 70 శాతం సిలబస్తో ఇంటర్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే.