హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): ఇంటర్ విద్యాసంవత్సరం జూన్ 1 నుంచి ప్రారంభంకాను న్న నేపథ్యంలో ఉద్యోగులు, అధ్యాపకుల బదిలీలు చేపట్టాలని ఇంటర్ విద్యాపరిరక్షణ సమితి, తెలంగా ణ ఇంటర్ గవర్నమెంట్ కాలేజీల లెక్చరర్స్ అసోసియేషన్ నేతలు ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం హైదరాబాద్లో మంత్రి సబితను వారు కలిసి వినతిపత్రం అందజేశారు. మిగిలిన కాంట్రాక్ట్ లెక్చరర్లను క్రమబద్ధీకరించాలని, 10 శాతం బోధనేతర సిబ్బందికి జేఎల్గా పదోన్నతులు కల్పించాలని, కాలేజీలు తెరుచుకొన్న తొలిరోజే పాఠ్యపుస్తకాలను అందించాలని కోరారు.