హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : ఇంటర్మీడియట్ విద్యార్థులకు అందించే సెంట్రల్ సెక్టార్ స్కాలర్షిప్నకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ఇంటర్బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర విద్యాశాఖ అందజేసే ఈ స్కాలర్షిప్లకు తెలంగాణ నుంచి 9,068 విద్యార్థులను ఎంపికైనట్టు పేర్కొన్నారు.
వీరిలో ఇప్పటివరకు కేవలం 3,148 మంది విద్యార్థులే దరఖాస్తు చేసుకొన్నారని వెల్లడించారు. మిగిలిన విద్యార్థులు నేషనల్ స్కాలర్షిప్స్ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలని మిట్టల్ సూచించారు.