హైదరాబాద్ : తెలంగాణలోని ప్రభుత్వ, ప్రయివేటు జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ మొదటి ఏడాది ప్రవేశాల గడువు మరోసారి పొడిగించారు. ఇంటర్ ప్రవేశాల కోసం ఈ నెల 30వ తేదీ వరకు గడువు పొడిగిస్తున్నట్టు ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడించింది. గడువు పొడిగింపు ఇదే చివరిసారని స్పష్టం చేసింది. ఆయా కాలేజీలు, యూనియన్ల విజ్ఞప్తుల మేరకు మరోసారి గడువు పొడిగించినట్లు ఇంటర్మీడియట్ బోర్డు పేర్కొన్నది.