హైదరాబాద్ : హైదరాబాద్ రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ ఇంటెలిజెన్స్ డీఎస్పీతో పాటు మరో వ్యక్తికి తృటిలో ప్రమాదం తప్పింది. హైదర్గూడలోని ఎస్వీఎం గ్రాండ్ హోటల్కు ఇంటెలిజెన్స్ డీఎస్పీ సత్యనారాయణ రాజు వెళ్లారు. అక్కడ లిఫ్ట్ ఎక్కగానే సాంకేతిక లోపం తలెత్తడంతో.. ఇంటెలిజెన్స్ డీఎస్పీ దాంట్లోనే ఇరుక్కుపోయారు. సమాచారం అందుకున్న హోటల్ సిబ్బంది అప్రమత్తమైంది. వెంటనే సంబంధిత ఎలక్ట్రీషియన్ను పిలిపించి మరమ్మతులు చేయిస్తుండగా అతడు కూడా లిఫ్ట్లో ఇరుక్కున్నాడు.
అటు ఇంటెలిజెన్స్ డీఎస్పీ, ఇటు ఎలక్ట్రిషీయన్ ఇద్దరు లిఫ్ట్లో ఇరుక్కుపోవడంతో హోటల్ సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, సాంకేతిక నిపుణుల సహాయంతో డీఎస్పీతో పాటు ఎలక్ట్రిషీయన్ను బయటకు తీసుకొచ్చారు. అనంతరం వారిద్దరిని ఆస్పత్రికి తరలించారు. డీఎస్పీ, ఎలక్ట్రీషియన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.