హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను పారదర్శకంగా, జవాబుదారీతనంతో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్రాజ్ కోరారు. మంగళవారం ఆయన బీఆర్కే భవన్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 17 శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఎన్నికల్లో మద్యం, నగదు, విలువైన వస్తువుల పంపిణీని నిరోధించేందుకు జి ల్లా స్థాయిలో ఇంటెలిజెన్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఫిర్యాదులపై రాష్ట్ర స్థాయి నోడల్ అధికారులు ఎప్పటికప్పుడు స్పందించే విధంగా ఉండాలని స్పష్టం చేశారు. సమావేశంలో ఎన్నికల కమిషన్ అదనపు సీఈవో లోకేశ్ కుమార్, జాయింట్ సీఈవో సర్ఫరాజ్ అహ్మద్, సీఐడీ అడిషనల్ డీజీ మహేశ్ భగవత్ పాల్గొన్నారు.