నారాయణపేట్, భువనగిరి, ఖమ్మంలలో నిర్మించిన సమీకృత మార్కెట్లకు రాష్ట్ర మున్సిపల్శాఖ మంత్రి కే తారకరామారావు కితాబు ఇచ్చారు. రాష్ట్రంలో ప్రతి పట్టణంలో కనీసం ఒక సమీకృత వెజ్, నాన్-వెజ్ మార్కెట్ నిర్మించాలనే ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా వీటిని నిర్మించినట్టు తెలిపారు. మున్సిపల్శాఖ సమీకృత మార్కెట్లను ఎంత బ్రహ్మాండంగా నిర్మించగలదో చెప్పడానికి ఇవి నమూనా మాత్రమేనని ప్రశంసించారు. ఆ మార్కెట్ల ఫొటోలను ట్విట్టర్లో పోస్టు చేశారు. వీటి నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన మంత్రి పువ్వాడ అజయ్, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్రెడ్డి, ఎస్ రాజేందర్రెడ్డి, సీడీఎంఏ ఎన్ సత్యనారాయణ, మున్సిపల్ చైర్మన్లను మంత్రి కేటీఆర్ ప్రశంసించారు.