హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) : ఏపీ మాడల్ స్కూల్స్ టీచర్స్ తరహాలో రాష్ట్ర మాడల్ స్కూల్ టీచర్లను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేయాలని తెలంగాణ మాడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ (టీఎంఎస్టీఏ) ప్రభుత్వాన్ని కోరింది.
విలీనం చేసి 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు భూతం యాకమల్లు, ప్రధానకార్యదర్శి చిలివేరు స్వామి శుక్రవారం విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశంను కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలోని 194 మాడల్ స్కూల్స్లో 3వేల మంది రెగ్యులర్ టీచర్లను విలీనం చేయాలని కోరారు.