కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగుల కొవ్వొత్తుల నిరసన
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 17 : కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఎల్ఐసీ-ఐపీవో నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గురువారం అబిడ్స్ బ్రాంచ్ (సీబీ-7) వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన ద్వారా ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ యూనియన్ (ఐసీఈయూ) హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్లు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు సీబీ-7 కార్యదర్శి వీ రమేశ్గౌడ్, అధ్యక్షుడు మహేశ్ వెల్లడించారు. ఎల్ఐసీలో 5 తం వాటాల ఉపసంహరణకు కేంద్ర ం ఎంత వేగంగా అడుగులు వేస్తే అంతే దీటుగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. లిస్టింగ్ రోజున దేశవ్యాప్తంగా 2048 బ్రాంచి కార్యాలయాలతోపాటు డివిజన్, జోనల్, సెంట్రల్ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఒకరోజు సమ్మెలో పాల్గొంటామని పేర్కొన్నారు. మార్చి 28, 29 తేదీల్లో రెండు రోజుల జాతీయస్థాయిలో సమ్మె నిర్వహించనున్నట్టు చెప్పారు. నిరసనలో ఐసీఈయూ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.