హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): తిరుమలలోని శ్రీవారి ఆలయంలో భక్తులు కానుకలను సమర్పించేందుకు స్టీలు హుండీలను ఏర్పాటు చేయాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. దీనిలో భాగంగా ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఒక స్టీల్ హుండీని ఏ ర్పాటు చేశారు. ఐదు అడుగులు ఉన్న ఈ స్టీల్ హుండీని తీసుకెళ్లి పరిశీలించారు. వినియోగం సులభంగా ఉంటే మరిన్ని స్టీలు హుండీలు ఏర్పాటు చే యాలని అధికారులు భావిస్తున్నారు.