ముందుకొచ్చిన కిడ్వాయి దవాఖాన డాక్టర్లు
అభినందిస్తూ ఎంపీ సంతోష్కుమార్ ట్వీట్
హైదరాబాద్, జూన్ 06 (నమస్తే తెలంగాణ): ఎంపీ సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నది. గ్రీన్ చాలెంజ్ ప్రేరణతో బెంగళూరులోని కిద్వాయి దవాఖాన డెయిరీ సర్కిల్లోని మినీ ఫారెస్ట్ను మాజీ హోంమంత్రి, బీటీఎం నియోజకవర్గ ఎమ్మెల్యే రామలింగారెడ్డి పేరిట దత్తత తీసుకున్నట్టు కిద్వాయి హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ రామచంద్ర, గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధి రంజిత్ ఎం రెడ్డి తెలిపారు. మొత్తం 30 వేల మొక్కలు నాటామని, హరిత దవాఖానగా మలుస్తామని చెప్పారు. దీనిపై ఎంపీ సంతోష్కుమార్ ట్వీట్ ద్వారా స్పందించారు. చాలా మంచి పనిచేశారని అభినందించారు. అవకాశం ఉన్న అన్నిమార్గాలను వాడుకుని ప్రకృతిని కాపాడుకోవాలని ఆయన సూచించారు.