జయశంకర్ భూపాలపల్లి : కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram project)కు సంబంధించిన కార్యాలయాల్లో రెండవ రోజు విజిలెన్స్ అధికారుల(Vigilance officials) తనిఖీలు కొనసాగుతుననాయి. మేడిగడ్డ బ్యారేజి, కన్నెపల్లి పంప్ హౌస్ కు సంబంధించిన ఇరిగేషన్ కార్యాలయాల్లో(Irrigation offices) విజిలెన్స్ ఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో 10 బృందాలుగా విడిపోయి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలు మంగళవారం అర్ధరాత్రి వరకు నిర్వహించి పలు కీలకమైన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.
అలాగే కన్నెపల్లి పంప్ హౌస్ను సీజ్ అధికారులు చేశారు. మాహదేవపూర్ ఇరిగేషన్ డివిజన్ కార్యాలయంలో పోలీస్ సెక్యూరిటీ మధ్య కీలకమైన ఫైల్స్నువిజిలెన్స్ అధికారులు భద్రపరిచారు. అర్ధరాత్రి అనంతరం మేడిగడ్డ వద్ద గల ఇరిగేషన్ గెస్ట్ హౌస్లో రెస్ట్ తీసుకున్న అధికారులు.. బుధవారం ఉదయం 10 గంటలకు తిరిగి మహాదేవ్పూర్ డివిజన్ కార్యాలయానికి వచ్చి తనిఖీలను ముమ్మరం చేశారు.