హైదరాబాద్, జనవరి 10(నమస్తే తెలంగాణ): ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా మంత్రితో కలిసి తిరుమలకు వెళ్లారన్న అభియోగాలతో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ ఎండీ బోయినపల్లి మనోహర్రావును సస్పెండ్ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం జారీచేసిన ఉత్తర్వులపై 3 వారాల్లోగా విచారణ పూర్తి చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
సస్పెన్షన్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ మనోహర్రావు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్కుమార్ ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది.