హైదరాబాద్, మే 4(నమస్తే తెలంగాణ): ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణకు కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ శాఖలో మహిళా ఉద్యోగుల ఫిర్యాదులను పరిష్కరించేందుకు అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ జీవో మేరకు కార్యాలయాల్లో మహిళా భద్రతకు అమల్లో ఉన్న పోస్(ప్రివెన్షన్ ప్రొహిబిషన్ అండ్ రిడ్రెసల్) చట్టం-2013 నిబంధనల ప్రకారం ఈ కమిటీ పనిచేయనున్నది.