హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): విద్యారంగంలో వినూత్న సంస్కరణలకు రాష్ట్ర విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది విద్యార్థుల వికాసం కోసం రెండు కార్యక్రమాలు అమలు చేయనున్నది. ఇంటర్ విద్యార్థులు స్టార్టప్లు తయారు చేసేందుకు బిజినెస్ ఇన్నోవేషన్ చాలెంజ్ కార్యక్రమాన్ని అమలు చేయనున్నది. దీనికి ‘అంకురం’ పేరును అధికారులు ఖరారు చేశారు. పాఠశాల విద్యలోని 6,7 తరగతుల విద్యార్థుల కోసం హ్యాపీనెస్ కరికులాన్ని అమలు చేయనున్నది. దీనికి ‘చెలిమి’ పేరును ఖరారు చేశారు. ఈ రెండింటినీ తొలుత పైలెట్ ప్రాజెక్టులుగా అమలు చేస్తారు.
24 కాలేజీల్లో అంకురం
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు స్టార్టప్లు తయారు చేయడమే అంకురం కార్యక్రమ ముఖ్యోద్దేశం. తొలి దశలో 8 జిల్లాల్లోని 24 కళాశాలల్లో అమలు చేస్తారు. 2,500 మంది విద్యార్థులు తమ సృజనాత్మకతతో తయారు చేసిన వర్కింగ్ మాడల్స్ను ఎంపిక చేస్తారు. వాటిలో మెరుగైన 1,500 ఆవిషరణలను ప్రోత్సహించి, ఒకో ఆవిషరణకు రూ.2 వేల చొప్పున ప్రోత్సాహకంగా అందజేస్తారు. వీటిలో ఉత్తమమైన వాటిని ఎంపికచేసిన ప్రత్యేక ఎగ్జిబిషన్లలో ప్రదర్శిస్తారు. వీటిలో నుంచి కొన్నింటిని బిజినెస్ మాడల్స్గా తయారు చేస్తారు.
33 బడుల్లో ‘చెలిమి’
బడిలో చిన్నారులకు ప్రేమ, వాత్సల్యంతో పాఠాలు బోధించేందుకు చెలిమి పేరుతో హ్యాపీనెస్ కరికులాన్ని పాఠశాల విద్యాశాఖ అమలు చేయనున్నది. జిల్లాకో పాఠశాల చొప్పున 33 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని అమలుచేస్తారు. దీనికోసం 35 మంది ఉపాధ్యాయులకు ఇప్పటికే ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప్రత్యేక కరదీపికలను సిద్ధం చేస్తున్నారు. బడుల్లో పాఠాలకు బదులుగా జాయ్ఫుల్ లర్నింగ్.. బ్యాగ్లెస్ డేలకు ప్రాధాన్యం ఇస్తారు. కథలు, కృత్యాలు, నృత్యాలు, ఆటలు, పాటలతో పాఠాలు బోధిస్తూ వారి వికాసానికి దోహదపడతారు.