మహబూబ్నగర్, మే 27 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరుతో దళితులకు అన్యాయం జరుగుతున్నదని, అందుకే ఈ ప్రభుత్వాన్ని వెంటనే గద్దె దించాలని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ పిలుపునిచ్చారు. శుక్రవారం మహబూబ్నగర్లోని రెడ్క్రాస్ భవనంలో టీఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా వంగపల్లి శ్రీనివాస్ మాదిగతోపాటు అధికార ప్రతినిధి మల్లెపోగు శ్రీనివాస్ మాదిగ మాట్లాడుతూ.. బీజేపీ తమ శాశ్వత శత్రువన్నారు. మతవిద్వేషాలతో మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్న బీజేపీ ప్రజలను మోసం చేస్తున్నదని ధ్వజమెత్తారు. బీజేపీ నాయకులను ఊరూరా అడ్డుకోవాలని, అప్పుడే దళితులకు మంచి రోజులు వస్తాయన్నారు.